హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మెగా జాబ్‌ మేళా

తిరుపతి జిల్లా తడ సమీపంలోని శ్రీనిధి సెజ్‌లో ఈనెల 18న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఐటీఐ, డిప్లొమా, పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతలతో 18-28 ఏళ్లలోపు యువత అర్హులు. న్యూ నేట్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నెలకు రూ.17,800 నుంచి రూ.20,750 వరకు జీతం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 6303578886 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.