హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్ట్

WNP: గోపాల్‌పేట్ మండలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు మహిళల నుంచి రూ.లక్ష వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు పంపిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వంగురు రవిప్రసాద్, తొగట హనుమాన్ దాస్‌లను నిన్న అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. అనంతరం వనపర్తి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.