హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివకోడులో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం

కోనసీమ: రాజోలు మండలం శివకోడులోని చైతన్య ఐటీఐ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సమాచారం ఉంటే ఈగల్ టోల్‌ఫ్రీ 1972కు, సైబర్ మోసాలపై 1930కు, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.