హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ఎఫెక్ట్.. మనోవేదనలో రైతులు

ATP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయని రైతులు మనోవేదనకు గురవుతున్నారు. కనేకల్ మండలంలో వర్షాభావంతో ఓ రైతుకు చెందిన మిరప తోట పంట పూర్తిగా ఎండిపోయింది. పంటను కాపాడుకునేందుకు రూ. 3 లక్షలు ఖర్చుచేసి బోర్లు వేసిన రైతుకు ఫలితం లేకుండా పోయింది. అప్పుల ఊబిలో కురుకుపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.