హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీహెచ్ సేవలపై లోక్‌సత్తా ఆందోళన

VSP: కేజీహెచ్, విమ్స్‌లో మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఉషోదయ జంక్షన్ కార్యాలయంలో మాట్లాడారు. విమ్స్‌లో ఎస్‌టీపీ, కార్డియో న్యూరో క్యాథ్‌ల్యాబ్ సమస్యల పరిష్కారానికి సీఎం దృష్టి సారించాలని కోరుతూ లేఖలు రాసినట్లు తెలిపారు.