హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో 19 నుంచి మహిళా క్రికెట్ లీగ్

GNTR: మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27 వరకు ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి హాజరుకానున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, అభిమానులకు ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.