KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలోని రామసముద్రం చెరువు సోమవారం కురిసిన భారీ వర్షానికి మత్తడి దూకుతోంది. దీంతో సుందర దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్థులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు చెరువు వద్దకు చేరుకుని సందడి చేశారు. వర్షాలతో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవని, చెరువుపై ఆధారపడిన మత్స్యకారులకు సైతం మేలు జరుగుతుందని వారు తెలిపారు.
తెలంగాణ
జలకళ సంతరించుకున్న రామసముద్రం చెరువు


