NGKL: ఉప్పునుంతల మండల సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు MPDO వరుణ్ తేజ ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశానికి సర్పంచులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులు, వివిధ శాఖల ప్రగతిపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
19న మండల సర్వసభ్య సమావేశం: MPDO


