హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండి రైల్వే గేట్ మూసివేత

W.G: ఉండి LC-104 ఆర్‌వోబీ నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్‌పై 46 మీటర్ల భారీ స్టీల్ గిర్డర్ల అమరిక పనులు ఈ నెల 22 వరకు కొనసాగుతాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పనుల కారణంగా ఉండి రైల్వే గేట్ మూసివేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఆర్‌వోబీ నిర్మాణం నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు.