హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి టోర్నీలో చిన్నారి మెరుపులు

NTR: కాకినాడలో జరిగిన స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో విజయవాడకి చెందిన చిన్నారి శ్రీకర లాస్య 4 స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. మంగళవారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను కలిసిన లాస్యను ఆయన అభినందించారు. చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి టైటిల్‌ సాధించడం గర్వకారణమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.