హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిజిస్ట్రేషన్‌ ఉంటేనే ఎరువులు: ఏఈవో

గద్వాల: యూరియా తదితర ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడానికి ‘ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌’ తప్పనిసరి అని గట్టు మండల ఏఈవో తోహిద్‌ తెలిపారు. స్థానిక రైతువేదికలో రైతులకు ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఎరువుల కేటాయింపు సులువవుతుందన్నారు. కొరత, ఇబ్బందులు లేకుండా ప్రతి రైతు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.