హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు'

కోనసీమ: ఖరీఫ్‌ 2026-27 ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధర అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ వై.ఖోమ్‌ నైడియా దేవి అధికారులను ఆదేశించారు. నవంబర్‌ తొలి వారంలో ధాన్యం రాకలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో తూకం, తేమ పరీక్ష పరికరాలు, గోనె సంచులు, రవాణా సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారు.