KMM: రఘునాథపాలెంలోని సుడా పార్కును ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సూచించారు. మంగళవారం ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పార్కును, సమీపంలోని కళాశాల పనులను పరిశీలించారు. పార్కు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సుడా పార్కును వినియోగంలోకి తీసుకురావాలి: పువ్వాళ్ల


