హైదరాబాద్: 28°C
వార్తలు

మెటా కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి టెక్ దిగ్గజం మెటా తలొగ్గింది. బాలలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలను దర్యాప్తు సంస్థలకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇలాంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దేశంలోని ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కైనా పిల్లల ఆన్‌లైన్ భద్రత కాపాడటం ఒక ప్రాథమిక బాధ్యతని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో రాజీ పడేేేది లేదని స్పష్టం చేసింది.