హైదరాబాద్: 28°C
వార్తలు

‘విజయన్‌పై ఈడీ కేసు.. బీజేపీ కుట్రే’

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌పై ఈడీ కేసు నమోదు చేయాలని కోరడం రాజకీయ కుట్రేనని యూడీఎఫ్ మద్దతు గల స్వతంత్ర ఎమ్మెల్యే, మాజీ సీపీఎం నేత టీకే గోవిందన్ విమర్శించారు. ఇండియా కూటమిని చీల్చేందుకే బీజేపీ ఈడీని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని, ఈడీ చర్యల వెనుక బీజేపీ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.