హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు

బ్రిక్స్‌ సదస్సులో PM మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని, మానవాళి వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న యుద్ధాల ప్రభావం సామాన్యులపై పడుతోందన్నారు. భవిష్యత్ సవాళ్లను సకాలంలో గుర్తించి ఎదుర్కోవాలన్నారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ఇకపై కేవలం నిబంధనలు పాటించేవిగానే కాకుండా.. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.