హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయంలో 14 నుంచి వినాయక నవరాత్రులు

SRCL: రాజన్న సన్నిధిలో ఈ నెల 14 నుంచి 23 వరకు వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆలయంలో గణపతికి ఏకాంతంగా పూజలు నిర్వహించనున్నారు. భక్తుల దర్శన సౌకర్యార్థం భీమేశ్వర మండపంలో ప్రత్యేక గణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.