MBNR: జడ్చర్ల మండల పరిధిలో కొనసాగుతున్న SIR ప్రక్రియను ప్రజలకు సులభంగా, పారదర్శకంగా నిర్వహించాలని టీఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తాహెర్ గడ్డి పాండు తహసీల్దార్ను కోరారు. మ్యాపింగ్ పూర్తయినప్పటికీ పలువురికి నోటీసులు రావడంతో ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. నోటీసుల్లో కారణం, సరిచేయాల్సిన వివరాలు, సమర్పించాల్సిన ఆధారాలను స్పష్టంగా పేర్కొనాలని కోరారు.
తెలంగాణ
'SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి'


