హైదరాబాద్: 28°C
తెలంగాణ

లుంబినీ పార్క్‌లో జీరో డిశ్చార్జ్ టాయిలెట్ యూనిట్

HYD: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి హైదరాబాద్ లుంబినీ పార్క్‌లో రీఫ్లో జీరో డిశ్చార్జ్ టాయిలెట్ యూనిట్‌ను ప్రారంభించారు. నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు. స్థిరమైన నగరాల నిర్మాణానికి వినూత్న పరిష్కారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.