హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లేశ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

HYD: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మల్లేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన సికింద్రాబాద్ కోర్టు మల్లేశ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆర్మీకి సంబంధించిన ఆయుధాల చోరీ కేసు కావడంతో దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు.