హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య

ఖమ్మం: సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముదిగొండలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తనను కొందరు రూ. 20 లక్షలు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ముదిగొండకు చెందిన మెట్టెల వినయ్ కుమార్ అనే యువకుడు లేఖలో ఆరోపించాడు. తల్లిదండ్రులు, సీఐకి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.