హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు చోరీ కేసులో A3 నిందితుడి అరెస్ట్

బాపట్ల- అప్పికట్ల మధ్య సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన చోరీ కేసులో A3 నిందితుడు కిషన్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. హర్యానాలోని సింఘాల్ గ్రామంలో అతడిని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గతంలోనూ అతడు పలుమార్లు రైలు చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు.