హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెహ్రూ జూ పార్కుకు విద్యార్థుల పర్యటన

మెదక్ జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించేందుకు నెహ్రూ జూ పార్క్‌కు ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాలతో డీఈవో ఎస్.రాజు పర్యవేక్షణలో 63 మంది విద్యార్థులు, 63 మంది తల్లిదండ్రులు, ఐఈఆర్‌పీలు, సిబ్బంది కలిపి 148 మంది మూడు బస్సుల్లో హైదరాబాద్ జూకు వెళ్లారు.