ASR: 8వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ నిశాంతి ‘ప్రాజెక్ట్ డ్రోన్’ బెస్ట్ ప్రాక్టీస్ను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఏజెన్సీ ప్రాంతం పీహెచ్సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు ఔషధాలు, బ్లడ్ యూనిట్లు, వైద్య నమూనాలను డ్రోన్లతో తరలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1,800 ఫ్లైట్స్లో 72వేల కి.మీ. ప్రయాణించి, 83వేలకు పైగా ఔషధాలు, 9,500పరీక్షల నమూనాలు తరలించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రోన్తో మారుమూల ప్రాంతాలకు వైద్యం'


