హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్‌ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శుక్రవారం పరిశీలించారు. యార్డులో దెబ్బతిన్న కార్యాలయ భవనాలు, పెచ్చులూడుతున్న స్లాబ్లు, శిథిలమైన డ్రైన్లు, పగిలిన నీటి పైపులను ఏఎంసీ ఛైర్మన్‌ లక్ష్మణ్‌ ఎమ్మెల్యేకు చూపించారు. యార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.