హైదరాబాద్: 28°C
వార్తలు

అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇండిగో విమానానికి బెదిరింపులు రావడం కలకలం రేపింది. లక్నో నుంచి దమ్మామ్ వెళ్తున్న విమానంలో బాంబు అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించి పైలట్‌కు చెప్పారు. దీంతో విమానాన్ని అహ్మదాబాద్ విమాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.