హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ

చిన్నారుల SM వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లు సామాజిక మాధ్యమాలు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించే విషయంలో హద్దులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. చిన్నారుల సోషల్ మీడియా వాడకానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.