హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: బోనస్ పొందాలంటే నేడే లాస్ట్

TG: సన్నరకం వరి సాగు చేసిన రైతులు రూ.500 బోనస్ పొందాలంటే పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. నేటితో గడువు ముగియనుంది. టీ-అగ్రిసీడ్స్ వెబ్ పోర్టల్‌లో రైతుల ఆధార్, పాస్‌బుక్, విత్తన కొనుగోలు రసీదు వివరాలను నమోదు చేయాలి. షాపుల్లో విత్తనాలు కొంటే డీలర్లే ఈ ప్రాసెస్ పూర్తి చేస్తున్నారు. సొంత విత్తనాలతో సాగు చేసిన రైతులు సెల్ఫ్ డిక్లరేషన్‌ ఇవ్వాలి.