హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేశవరం పీహెచ్‌సీలో అధికారులు తనిఖీలు

కోనసీమ: మండపేట మండలంలోని కేశవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర, డీఎన్‌ఎం డాక్టర్ హారిక బుధవారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో రికార్డులు, ల్యాబొరేటరీ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు అందించారు.