అన్నమయ్య: రాజంపేట (మం) ఆకేపాడులో బుధవారం నిర్వహించిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్రాజు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ప్రాంతానికి అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు: చమర్తి


