హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లోక్‌భవన్‌ను ముట్టడించిన BSP శ్రేణులు

NTR: విజయవాడ లోక్‌భవన్‌ను బహుజన సమాజ్‌ పార్టీ (BSP) నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. అంబేద్కర్‌ స్మృతివనంలోని అంబేద్కర్‌ విగ్రహ ప్రాంగణం నుంచి అంబేద్కర్‌ కళావేదిక మీదుగా లోక్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునేలోపే గేటు ఎదుట బైఠాయించి న్యాయం చేయాలంటూ.. నినాదాలు చేశారు. దళితులపై దాడులు అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.