హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీ ముట్టడిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడికి గాయాలు

JN:ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ, బీజేవైఎం సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సౌడ రమేశ్‌ గాయపడ్డారు. పోలీసులతో జరిగిన తోపులాటలో తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పరామర్శించారు.