హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిర్మలాపూర్‌లో భూముల రీ-సర్వే ప్రారంభం

NGKL: ఉప్పునుంతల మండలంలో భూముల రీ-సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నాలుగు గ్రామాలను ఎంపిక చేయగా, ఇప్పటికే తిప్పాపూర్‌లో సర్వే మొదలైంది. ఇందులో భాగంగా మంగళవారం తిర్మలాపూర్‌లో రీ-సర్వే ప్రారంభించారు. జిల్లా సర్వే అధికారి గిరిధర్‌ రామానుజన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సర్పంచ్‌ శ్రీకాంత్‌ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.