హైదరాబాద్: 28°C
వార్తలు

బోగీలో 75 లీట‌ర్ల విదేశీ మ‌ద్యం.. మహిళ అరెస్ట్

బీహార్ సమస్తిపూర్ జంక్షన్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్ రైలుబోగీలో విదేశీ మద్యం దొరకటం కలకలం రేపింది. సుమారు 75 లీటర్ల విదేశీ మద్యంతో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల నేహా జానును పోలీసులు అరెస్టు చేశారు. ఈ విదేశీ మద్యం విలువ సుమారు 1.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తమ ఇంట్లో పెళ్లి వేడుక ఉన్నందున హర్యానా నుంచి మద్యాన్ని తీసుకొస్తున్నట్లు ఆమె చెప్పారు.