హైదరాబాద్: 28°C
వార్తలు

5 లక్షల సిమ్‌కార్డులు కొననున్న హర్యానా

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం 5 లక్షల సిమ్ కార్డులను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 5 లక్షల మంది 10, 12 తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని చెప్పింది. ఈ ట్యాబ్‌లలో ఇంటర్నెట్ కోసం సిమ్ కార్డులను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. సిమ్‌లతో పాటు అంబులెన్సులను కూడా కొననున్నట్లు చెప్పింది.