హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం ఆలయానికి విరాళం

విజయనగరం టీడీపీ సీనియర్ నాయకులు పిల్లా విజయకుమార్, వినాయకమ్మ దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి రూ.1,00,016 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ.. స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. వీరి సేవా గుణాన్ని పలువురు నేతలు, భక్తులు అభినందించారు.