హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ కోతలపై రైతుల ధర్నా

KDP: మైదుకూరు మండలం కృష్ణాపురం రైతులు విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి రోజులో గంట కూడా కరెంటు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేపట్టారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ను రైతులు కోరారు.