హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం తొలి ఛైర్మన్ ఎవరంటే..!

VZM: 1888లో ఏర్పాటైన విజయనగరం మున్సిపాలిటీకి భూపతిరాజు వెంకటపతి రాజు తొలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రజావసరాల దృష్ట్యా 2015లో ప్రభుత్వం దీనిని కార్పొరేషన్‌ చేయగా.. 2019 నాటికి 50 డివిజన్లతో విస్తరించింది. అనంతరం 2021లో నిర్వహించిన తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా.. వెంపడాపు విజయలక్ష్మి విజయనగరం నగరపాలక సంస్థకు తొలి మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.