హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధరలు తగ్గించాలని పీఓడబ్ల్యూ నిరసన

NRPT: నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కోటకొండలో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సరుకులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.