PDPL: రైతుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18న పెద్దపల్లిలో రైతు సదస్సు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. రైతులకు గిట్టుబాటు ధర, రుణమాఫీ, పంట నష్టపరిహారం, సాగునీరు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రైతులు హాజరై సదస్సును విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
ఈ నెల 18న రైతు సదస్సు


