హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ పత్రాలతో బంగ్లాదేశీయుడి చొరబాటు

HYD: అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ పొందిన బంగ్లాదేశీయుడి కేసును RGIA ఔట్ పోస్ట్ పోలీసులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. 2009లో చొరబడిన బోయిద చార్లెస్ అనే వ్యక్తి, పుణేలోని ఏజెంట్ ద్వారా నకిలీ ఆధార్, జనన ధ్రువీకరణతో పాస్‌పోర్ట్ పొందాడు. మార్చి 16న శంషాబాద్ వద్ద పట్టుబడగా, తీవ్రత దృష్ట్యా సమగ్ర విచారణకు సీసీఎస్‌కు అప్పగించారు.