VSP: విశాఖ రామ్ నగర్, ఆమ్ని RK హాస్పిటల్ ఎదురుగా ఉన్న లయన్స్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో అడ్వెంచర్ బడ్డీ బైకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పేద, అవసరమైన రోగుల కోసం బైకర్స్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సమాజ సేవే తమ లక్ష్యమని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. 13 మందికి పైగా రక్తదానం చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదల కోసం రక్తదానం చేసిన అడ్వెంచర్ బడ్డీ బైకర్స్


