హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయ ఉద్యోగులకు PRC ప్రకటించాలీ

BDK: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నేడు కొత్తగూడెంలోని TSUTF జిల్లా కార్యాలయం టీచర్స్ భవన్ నందు జరిగింది. ఈ సమావేశంలో TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఉపాధ్యాయ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ని రద్దు చేయాలన్నారు.