NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు చేపట్టిన మున్నేరు కాలువ పూడికతీత పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. దీనికి PACS చైర్మన్ కొట్టె. హరికృష్ణ (బద్రి) కాలువను ప్రారంభించారు. మున్నేరు నీటిపై ఆధారపడి వరిపంట సాగు చేస్తున్న రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. సాగునీరు సక్రమంగా అందేలా కాలువను అందుబాటులోకి తీసుకురావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్నేరు కాలువ పూడికతీత పనులు ప్రారంభం


