హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతిరోజూ రాత్రి గంటపాటు కరెంట్ కట్

CTR: యాదమరి మండలంలో ప్రతిరోజూ రాత్రి 9:30 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ గురప్ప తెలిపారు. పవర్ గ్రిడ్‌లో విద్యుత్ లభ్యత, వినియోగదారుల డిమాండ్ మధ్య వ్యత్యాసం కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంటపాటు లోడ్ రిలీఫ్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని కోరారు.