హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి పొంగూరు నారాయణ, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యన్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.