గుండును 22 మీటర్ల దూరం విసిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడమే తన లక్ష్యమని భారత షాట్పుట్ స్టార్ తజిందర్పాల్ సింగ్ తూర్ తెలిపారు. జావెలిన్లో నీరజ్ చోప్రా మాదిరిగా రాబోయే తరానికి ఒక ప్రామాణికం సృష్టించాలనుకుంటున్నట్లు చెప్పారు. కెరీర్ అంతటా గాయాలు వేధించినా, భారత అథ్లెట్లు వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
క్రీడలు
22 మీటర్ల త్రోనే లక్ష్యం: తజిందర్పాల్


