హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జెడ్పీ పరిధిలో 27 స్థానాలు

CTR: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చిత్తూరు జిల్లా పరిషత్‌ పరిధిలో 27 ZPTC స్థానాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లా పరిషత్‌లుగా విడిపోనుంది. మిగిలిన ప్రాంతాలు తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిషత్‌ల పరిధిలోకి వెళ్లనున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోతో ZPTC స్థానాల పునర్‌వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది.