సత్యసాయి: రాష్ట్రంలో 28 జిల్లాలకు 28 జిల్లా పరిషత్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అనంతపురం జడ్పీ రెండుగా విడిపోనుంది. కొత్తగా శ్రీసత్యసాయి జిల్లాకు ప్రత్యేక జిల్లా పరిషత్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత నూతన జడ్పీ పరిధిని అధికారికంగా నిర్ణయిస్తారు.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి జిల్లాకు కొత్త జడ్పీ


