హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలపై బీఆర్‌ఎస్ విద్యార్థుల ర్యాలీ

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పద్మారావునగర్‌లో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్పీ కాలేజీ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.